న్యూఢిల్లీ: కేంద్ర వ్యవసాయ చట్టాలపై తాము సమర్పించిన నివేదికను వీలైనంత త్వరగా ప్రజలకు అందుబాటులో ఉంచేలా చూడాలని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్వీ రమణకు సుప్రీంకోర్టు కమిటీ సభ్యుడు అనిల్ ఘన్వత్ లేఖ కోరారు. ‘వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తామని కేంద్రం తెలిపింది. దీంతో మా నివేదిక నిరుపయోగమేనన్న భావన చాలా మందిలో నెలకొంది. కానీ నివేదికలో మేము చాలా కీలక విషయాలను ప్రస్తావించాం. వీలైనంత త్వరగా మా నివేదికను బహిరంగ పర్చగలరు. లేదా నివేదికను బహిరంగపర్చే అధికారం మాకు ఇవ్వగలరు’ అని ఆ లేఖలో అనిల్ ఘన్వత్ కోరారు.