హైదరాబాద్, మార్చి 2(నమస్తే తెలంగాణ): కేఎఫ్సీ.. ఇప్పుడు రుచికరమైన బిర్యానీ బకెట్ను కూడా అందుబాటులోకి తెచ్చింది. తమ అభిమానుల కోరికపై ప్రత్యేకమైన రుచులతో సువాసనలతోకూడిన మేలురకం బియ్యం, మసాలాలు, వేయించిన ఉల్లిపాయ, స్పైసీగ్రేవీతో బిర్యానీని తయారు చేసినట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. హాట్ క్రిస్పీ బిర్యానీ బకెట్, పాప్కార్న్ చికెన్ బిర్యానీ బకెట్, స్మోకీ గ్రిల్డ్ బిర్యానీ బకెట్, వెజ్ బిర్యానీ బకెట్ పేర్లతో నాలుగు వైవిధ్యభరితమైన బిర్యానీలను ప్రవేశపెట్టినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ఆర్డర్ చేసిన ఏడు నిముషాల్లో పికప్ కోసం సిద్ధం చేస్తామని, గడువులోగా ఇవ్వకపోతే వినియోగదారులకు హాట్, క్రిస్పీ చికెన్ను కాంప్లిమెంటరీగా అందిస్తామన్నారు. కేఎఫ్సీ బిర్యానీ బకెట్ ధర రూ. 169 నుంచి ప్రారంభమవుతుంది.