సాయికుమార్, రాధిక శరత్కుమార్, నందినిరాయ్, చాందిని చౌదరి, చైతన్యకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ ‘గాలివాన’. శరణ్ కొప్పిశెట్టి దర్శకుడు. శరత్ మరార్ నిర్మాత. ఈ నెల 14న జీ5లో స్ట్రీమింగ్ కానుంది. ఇటీవల ప్రిరీలీజ్ వేడుక నిర్వహించారు. దర్శకుడు మాట్లాడుతూ ‘క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ సిరీస్ ఇది. రెండు కుటుంబాల మధ్య కథ నడుస్తుంది. గాలివాన రోజు ఓ ఇంటివద్ద ప్రమాదానికి గురైన వ్యక్తి ఉదయం లేచే సరికి చనిపోయి ఉంటాడు. అతని హత్యకు కారణం ఎవరన్నది కథలో ఆసక్తిని పంచుతుంది’ అన్నారు. తాను నటిస్తున్న తొలి వెబ్సిరీస్ ఇదని, కథ నచ్చడంతో అంగీకరించానని రాధిక శరత్కుమార్ పేర్కొన్నారు. ఎమోషన్స్తో పాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో ఈ సిరీస్ ఆకట్టుకుంటుందని సాయికుమార్ చెప్పారు. స్వీయ నిర్మాణ సంస్థ నార్త్స్టార్ ప్రొడక్షన్స్కు చాలా ప్రత్యేకమైన సిరీస్ ఇదని..భారీ తారాగణంతో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కించామని నిర్మాత శరత్మరార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో చాందినిచౌదరి, తాగుబోతు రమేష్, శరణ్యప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. ఈ సిరీస్కు కెమెరా: సుజాత సిద్దార్థ, సంగీతం: శ్రీచరణ్ పాకాల, దర్శకత్వం: శరణ్ కొప్పిశెట్టి.