ప్రభాస్ను ప్రశంసల్లో ముంచెత్తారు బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్. వీరిద్దరు కలిసి ‘ప్రాజెక్ట్ కె’ అనే చిత్రంలో నటిస్తున్నారు. శనివారం ప్రభాస్, అమితాబ్ కాంబో సన్నివేశాలు తెరకెక్కించారు. ఈ సందర్భంగా అమితాబ్బచ్చన్.. ప్రభాస్ మంచితనం, నటన ప్రతిభ గురించి ఆనందం వ్యక్తం చేశారు. ‘ప్రభాస్తో కలిసి నటించిన తొలిరోజు ఇది. అతని నటనా ప్రతిభ, మర్యాద నన్ను ఎంతో ఆకట్టుకున్నాయి. వైజయంతీ మూవీస్లో నటించడం గౌరవంగా భావిస్తున్నా’ అని ట్వీట్ చేశారు. అమితాబ్తో కలిసి నటించడంపై ప్రభాస్ తన సంతోషాన్ని వెల్లడించారు. ‘బిగ్ బీతో కలిసి నటించాలన్న కల నెరవేరింది. దిగ్గజ నటుడితో ఫస్ట్ షాట్ చిత్రీకరణ ముగించాం’ అని ఇన్స్టా పోస్ట్లో పేర్కొన్నారు. ప్రభాస్, దీపికా పడుకోన్, అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు నాగ్అశ్విన్ ‘ప్రాజెక్ట్ కె’ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. వైజయంతీ మూవీస్ సంస్థ నిర్మిస్తున్నది.