న్యూఢిల్లీ, ఏప్రిల్ 28: అంబుజా సిమెంట్ లాభాలకు చమురు సెగ గట్టిగానే తగిలింది. మార్చితో ముగిసిన మూడు నెలల కాలానికిగాను సంస్థకు 856.46 కోట్ల నష్టం వచ్చింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో సంస్థ రూ.1,228.24 కోట్ల లాభాన్ని గడించింది. కంపెనీ జనవరి-డిసెంబర్ మధ్యకాలాన్ని ఆర్థిక సంవత్సరంగా వ్యవహరిస్తున్నది. కంపెనీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 2.4 శాతం ఎగబాకి రూ.7,900.04 కోట్లకు చేరుకున్నది. క్రితం ఏడాది ఇది రూ.7,814.81 కోట్లుగా ఉన్నది. గత త్రైమాసికంలో సంస్థ నిర్వహణ ఖర్చులు 10 శాతం పెరిగి రూ.6,813.15 కోట్లకు చేరుకున్నాయి.