హైదరాబాద్, మార్చి 12 (నమస్తే తెలంగాణ) : కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫొటో ముద్రించాలని డిమాండ్ చేస్తూ సీఏపీఎస్ఎస్(కరెన్సీపై అంబేద్కర్ ఫొటో సాధన సమితి) ఆధ్వర్యంలో గురువారం ఢిల్లీలో మహాధర్నా నిర్వహించారు. సమితి అధ్యక్షుడు పరశురామ్ నేతృత్వంలో జరిగిన ఈ ధర్నాలో రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య, బీద మస్తాన్రావు తదితరులు పాల్గొని ప్రసంగించారు. అంబేదర్ లేకుంటే ఆర్బీఐ లేదని, ఆ మహనీయుడి ఫొటో కరెన్సీపై వేయకపోవడమంటే చరిత్రను విస్మరించడమేనని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్తామని వెల్లడించారు. కార్యక్రమంలో ఆళ్ల రామకృష్ణ, కంఠ వేణు, తైకొండ శ్రీను, కొల్లి నాగేశ్వర్రావు, దేవరకొండ రమాదేవి, కళాకరులు పాల్గొన్నారు.
హైదరాబాద్, మార్చి 12(నమస్తే తెలంగాణ) : హైదరాబాద్-కరీంనగర్-రామగుండం (స్టేట్ హైవే-1) నాలుగు లేన్ల రహదారి ప్రాజెక్ట్కు సంబంధించి కొత్త ఇండిపెండెంట్ ఇంజినీర్ నియామకం వరకు ప్రస్తుత ఇండిపెండెంట్ ఇంజినీర్ సేవలను కొనసాగించేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ ప్రాజెక్ట్.. పీపీపీ విధానంలో డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్ (టోల్) మోడల్పై అమలవుతున్నది. ఈ ప్రాజెక్ట్ పరిపాలనా అనుమతిని కూడా ప్రభుత్వం సవరించింది. ముందుగా మార్చి 2011 నుంచి ఫిబ్రవరి 2025 వరకు రూ.37.84 కోట్ల అనుమతి ఉండగా, ఇప్పుడు దానిని మార్చి 2011 నుంచి ఫిబ్రవరి 2026 వరకు రూ.39.78 కోట్లకు పెంచారు. ఈ మేరకు రవాణా, రోడ్లు మరియు భవనాలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్రాజ్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.