హైదరాబాద్, జనవరి 22 (నమస్తే తెలంగాణ): హుస్సేన్సాగర్ తీరంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం దేశానికే తలమానికంగా నిలవనున్నదని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ వివరించారు. అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు పనులను ఆయన ఆదివారం పరిశీలించారు. తెలంగాణ ప్రభుత్వం అంబేద్కర్ స్ఫూర్తితో ముందుకుసాగుతున్నదని కొనియాడారు. సెక్రటేరియట్కు అంబేద్కర్ పేరు పెట్టడంతోపాటు దేశంలో ఎక్కడా లేనివిధంగా 125 అడుగుల ఎత్తయిన విగ్రహాన్ని ఏర్పాటు చేయడం గర్వకారణమని చెప్పారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లోనూ దళితులకు ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని కొనియాడారు.