హైదరాబాద్, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ): కరివేపాకు పొడి, హెర్బల్ పౌడర్ల పేరుతో అమెజాన్ పికప్ బాయ్స్ సహకారంతో విశాఖ కేంద్రంగా ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ‘అమెజాన్’ ద్వారా ఆన్లైన్లో గంజాయి స్మగ్లింగ్ జరుగుతున్నట్టు మధ్యప్రదేశ్ పోలీసులు గుర్తించారు. ఎంపీ పోలీసుల బృందం బుధవారం విశాఖ నగరానికి వచ్చి గంజాయిని సరఫరా చేస్తున్న శ్రీనివాసరావు ఇంట్లో సోదాలు జరిపి అమెజాన్ స్టిక్కర్లు, ప్యాకింగ్ మెటీరియల్తో పాటు కొంత గంజాయిని స్వాధీనం చేసుకొన్నది. పట్టుబడిన నలుగురు నిందితులు విశాఖలోని కంచరపాలెం ఇండస్ట్రియల్ ఎస్టేట్లోని స్టోర్ ద్వారా కార్యకలాపాలు సాగిస్తున్నట్టు ఎస్ఈబీ అధికారులు గుర్తించారు. గంజాయి సరఫరా చేసే శ్రీనివాస్ అనే వ్యక్తితో పాటు అమెజాన్ పికప్ బాయ్స్ కుమారస్వామి, కృష్ణంరాజు, వెంకటరమణను ఆరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. వారిచ్చిన సమాచారం మేరకు విశాఖలో పోలీసులు బుధవారం విచారణ చేపట్టారు. ఈనెల 13న మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ సమీపంలో ఓ ధాబాలో గంజాయి పట్టుబడటంతో పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణలో భాగంగా విశాఖ నుంచి అమెజాన్ యాప్ ద్వారా గంజాయి అక్కడికి వచ్చినట్టు గుర్తించారు. విశాఖ నుంచి గంజాయి తెప్పించుకొనే ముగ్గురిని మధ్యప్రదేశ్లోని బెండీ ప్రాంతంలో అరెస్టు చేశారు.