నిజామాబాద్, జనవరి 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : సీఎం కేసీఆర్ ఆలోచనా విధానంతో రాష్ట్రం అన్ని రంగాల్లో వేగంగా, అద్భుతంగా అభివృద్ధి సాధిస్తున్నదని ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ చెప్పారు. రియల్ రంగం జోరందుకోవడానికి రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు, శాంతి భద్రతల పరిరక్షణ, మౌలిక సదుపాయాల కల్పన ముఖ్య కారణాలుగా పేర్కొన్నారు. నిజామాబాద్లోని పాత కలెక్టరేట్ మైదానంలో శనివారం ప్రారంభమైన ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ – ప్రాపర్టీ షో కార్యక్రమం ఆదివారం ముగిసింది. ఈ కార్యక్రమానికి ఆర్టీసీ చైర్మన్తోపాటు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా, నగర మేయర్ నీతూ కిరణ్, డీసీఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్, నుడా చైర్మన్ ప్రభాకర్రెడ్డి హాజరయ్యారు. ప్రాపర్టీ షోలో ఏర్పాటు చేసిన 20 స్టాళ్లను వారు పరిశీలించారు. ఆయా నిర్మాణ రంగ ప్రాజెక్టుల విశేషాలను ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. షోలో పాల్గొన్న ఆయా కంపెనీల ప్రతినిధులను ఘనంగా సన్మానించారు.
తెలంగాణ వచ్చాకే భూములకు విలువ..
ఈ సందర్భంగా ఆర్టీసీ చైర్మన్ మాట్లాడారు. తెలంగాణ వచ్చిన తర్వాతే భూములకు విలువ పెరిగిందని చెప్పారు. హైదరాబాద్తో సహా అనేక పట్టణాలు, నగరాలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు. గతంలో తెలంగాణ రాష్ట్రంలో రియల్ రంగం కుదేలైన పరిస్థితి నుంచి ఇప్పుడు జోరుగా సాగుతుండటం సీఎం కేసీఆర్ పరిపాలన దక్షతకు నిదర్శనమని చెప్పారు. రియల్ రంగంలో అనేక కంపెనీలు చేపడుతున్న ప్రాజెక్టును ఒకే గొడుగు కిందకు తీసుకు రావడం మంచి ప్రయత్నమని కితాబునిచ్చారు. ఆటో, ప్రాపర్టీ షోలతో ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ చేస్తున్న ప్రయత్నం అద్భుతమని కొనియాడారు. సమాజహితం, ప్రజా ప్రయోజనం కోసం పత్రిక నడపడంతోపాటు ప్రజల కోసం సంఘ సేవలో భాగంగా ఆటోషో, ప్రాపర్టీ షోలను నిర్వహించడం గొప్ప విషయమని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా చెప్పారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు దండు శేఖర్, మురళి, పుప్పాల రవి, నమస్తే తెలంగాణ బ్రాంచ్ మేనేజర్ గడ్డి ధర్మరాజు, ఎడిషన్ ఇన్చార్జి లక్మ రమేశ్, బ్యూరో చీఫ్ జూపల్లి రమేశ్, ఏడీవీటీ మేనేజర్ శ్రీకాంత్, ఏసీఎం సునీల్ తదితరులు పాల్గొన్నారు.