హైదరాబాద్, నవంబర్ 28(నమస్తే తెలంగాణ): వరుసగా కొవిడ్ వేవ్లు, ఆ తర్వాత వచ్చిన పండుగలతో ఈ ఏడాదంతా తీరికలేదు. కరోనా కష్టకాలంలో బయటి ప్రపంచాన్ని చూడనివాళ్లు, మానసిక ప్రశాంతతను కోరుకుంటున్నవాళ్లు చాలా మంది డిసెంబర్లో టూర్ ప్లాన్ చేసుకొంటున్నారు. ఈ ఏడాది చివరి పర్యటన కోసం ఎంతైనా ఖర్చు చేసేందుకు వెనకాడటం లేదు. ఒక్కొక్కరిపై రూ.10 వేలైనా ఖర్చు చేస్తామని 70 శాతం మంది అంటుంటే, రూ.50 వేల వరకు ఖర్చు చేస్తామని 15 శాతం మంది చెప్తున్నారు. ఇంటర్మైల్స్ తాజాగా విడుదల చేసిన ‘కన్జ్యూమర్ సెంటిమెంట్ ఇండెక్స్ రిపోర్ట్’లో ఈ విషయం వెల్లడైంది. అక్టోబర్లో దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లోని వేలాది మంది అభిప్రాయాలను సేకరించిన ఈ సంస్థ రిపోర్ట్ను విడుదల చేసింది.
నివేదికలోని ముఖ్యాంశాలు ఇవే
టూర్కు ఎందుకు వెళ్లాలనుకుంటున్నారు?
ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నారు?
టూర్లో కొవిడ్ జాగ్రత్తలు ఇలా..