బడంగ్పేట,జనవరి3 : ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా చిన్నారులకు వ్యాక్సిన్ వేసే కార్యక్రమం చేపడుతున్నామని విద్యాశాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బాలాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 15 నుంచి 18 సంవత్సరాల పిల్లలకు వ్యాక్సిన్ కార్యక్రమాన్ని మంత్రి సోమవారం ప్రారంభించారు. రూ. 25లక్షలతో నిర్మించిన వెయిటింగ్ హాల్ భవనాన్ని మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 6 లక్షల మంది పిల్లలు వ్యాక్సిన్ వేయించుకోవడానికి ఆన్లైన్లో పేర్లు నమోదు చేసుకున్నట్లు చెప్పారు. 15 – 18 సంవత్సరాల 22.79 లక్షల మంది పిల్లలకు వ్యాక్సిన్ వేయడానికి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. రంగారెడ్డి జిల్లాలో 2.35లక్షల మందికి వ్యాక్సినేషన్కు అర్హులుగా గుర్తించినట్లు చెప్పారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి స్వరాజ్య లక్ష్మి, మేయర్ దుర్గా దీప్లాల్ చౌహాన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్రెడ్డి, కమిషనర్ నాగేశ్వర్, డీఈఈ గోపీనాథ్, కార్పొరేటర్లు సిద్దాల లావణ్య బీరప్ప, అర్కల భూపాల్రెడ్డి, మాధవి ఈశ్వర్గౌడ్, ధనలక్ష్మి రాజ్కుమార్, గజ్జల రాంచందర్, లీలా రవినాయక్, అరుణ ప్రభాకర్రెడ్డి, బాలమణి, పల్లె జంగయ్య గౌడ్, టీఆర్ఎస్ నాయకులు అర్కల కామేష్రెడ్డి, దిండు భూపేష్ గౌడ్, పి జోజి, శ్రీనివాస్, తదితరులు ఉన్నారు.