అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించిన ‘పుష్ప’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా డాక్టర్ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్లో అల్లు అర్జున్కు ఘనంగా సన్మానం జరిగింది. ఈ కార్యక్రమానికి అగ్ర నటుడు చిరంజీవి, నిర్మాత అల్లు అరవింద్, టి. సుబ్బిరామిరెడ్డి, ప్రముఖ దర్శకులు త్రివిక్రమ్, హరీష్శంకర్, క్రిష్, గుణశేఖర్ తదితరులు హాజరయ్యారు. ఈ వేడుకలో అల్లు అర్జున్ కుటుంబ సభ్యులందరూ పాల్గొన్నారు.