ఇటీవలి కాలంలో ఓటీటీలో విడుదలై మంచి విజయం సాధించిన చిత్రం షేర్షా. కార్గిల్ వార్ లో ఇండియా విజయంలో ముఖ్య పాత్ర పోషించిన కెప్టెన్ విక్రమ్ బాత్రా జీవితం ఆధారంగా కరణ్ జోహార్ ఈ సినిమా తెరకెక్కించారు. స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమాను విడుదల చేశారు. సిద్ధార్థ్ మల్హోత్రా టైటిల్ పాత్ర పోషించిన ఈ వార్ డ్రామాలో కియారా కథానాయికగా నటించింది.
కార్గిల్ యుద్ధ వీరుడు కెప్టెన్ విక్రమ్ బాత్రా జీవిత చరిత్రగా తెరకెక్కిన ఈ సినిమాకు విష్ణు వర్ధన్ దర్శకత్వం వహించారు. ప్రైమ్ లో టాప్ మూవీస్ లిస్ట్ లో రెండో స్థానంలో ఉన్న ఈ సినిమా ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఈ సినిమాకు ఫిదా అయ్యారు.
షేర్షా బృందానికి అభినందనలు. హృదయానికి హత్తుకునే సినిమా. మిస్టర్ మల్హోత్రా కెరీర్ లోనే ఇది ఉత్తమ ప్రదర్శన. కియారా, ఇంకా ఇతర నటీనటులది అద్భుతమైన పర్ఫార్మెన్స్ . సినిమా టెక్నీషియన్స్ అందరికీ మై రెస్పెక్ట్. దర్శకుడు విష్ణు వర్ధన్ గారు ద్వారా అద్భుతమైన కన్విక్షన్. సర్ మీరు మా అందరిని గర్వపడేలా చేసారు. కరణ్ జోహార్ జీ, నిర్మాతలకు అభినందనలు. ఈ బ్లాక్ బస్టర్ హిట్ కోసం అమెజాన్ కు బిగ్ అభినందనలు. ప్రతి భారతీయుడు తప్పక చూడాలి” అంటూ అల్లు అర్జున్ ట్వీట్ చేసారు. బన్నీ ప్రశంసలతో ఉక్కిరి బిక్కిరి అయిన సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వాని ఈ సందర్భంగా బన్నీకి కృతజ్ఞతలు తెలియజేశారు.