అల్లరి నరేష్ హీరోగా నటిస్తున్న సినిమా ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’. ఆనంది నాయికగా నటిస్తున్నది. జీ స్టూడియోస్, హాస్య మూవీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రాజేష్ దండు నిర్మాత. బాలాజీ గుత్త సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఏఆర్ మోహన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర టైటిల్ పోస్టర్ను చిత్రబృందం ఆదివారం విడుదల చేశారు. పోస్టర్ చూస్తే..అడవి మధ్యలో కొందరు గ్రామస్తులు పిల్లలతో సహా నిలుచుని ఉన్నారు. వారి ముందు ఓ యువకుడు బల్లెం పట్టుకుని ధైర్యంగా నిలబడ్డాడు. ఈ పోస్టర్ చూస్తే ప్రజానీకం తిరుగుబాటును కథలో చూపిస్తున్నట్లు తెలుస్తున్నది. ప్రస్తుతం చిత్రీకరణలో ఉన్న ఈ సినిమాలో ప్రవీణ్, వెన్నెల కిషోర్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : రామ్ రెడ్డి, ఎడిటర్ : ఛోటా కె ప్రసాద్, సంగీతం : శ్రీచరణ్ పాకాల.