అనారోగ్యం కారణంగా కేన్స్ ఫిలిం ఫెస్టివల్కు వెళ్లలేకపోతున్నానంటూ అక్షయ్ కుమార్ ప్రకటించారు. ఈనెల 17న కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో ఇండియన్ డెలిగేషన్లో అక్షయ్ పాల్గొనాల్సి ఉంది. ఈ చిత్రోత్సవాల ఇండియన్ పెవిలియన్లో నవాజుద్దీన్ సిద్ధికీ, నయనతార, తమన్నా, పూజా హెగ్డే, ఏఆర్ రెహమాన్, ఆర్. మాధవన్ లాంటి నటీనటులంతా ఉన్నారు. వీళ్లు కేన్స్లో రెడ్ కార్పెట్పై సందడి చేయబోతున్నారు. అక్షయ్ కుమార్ కూడా కేన్స్లో ఇండియన్ డెలిగేషన్ కోసం సిద్ధమయ్యారు.
ఇంతలో ఆయనకు కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. దీంతో కేన్స్కు వెళ్లలేకపోతున్నానని, ఈ చిత్రోత్సవాల్లో పొందే ఆనందాన్ని కోల్పోయానని అన్నారు. భారత బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. మాధవన్ నటించిన ‘రాకెట్రీ ద నంబి ఎఫెక్’్ట సినిమా ఈనెల 19న కేన్స్ చిత్రోత్సవాల్లో వరల్డ్ ప్రీమియర్ కానుంది. ఈ నెల 17 నుంచి 28 తేదీ వరకు ఫ్రాన్స్లో 75వ కేన్స్ ఫిలిం ఫెస్టివల్ జరగనుంది.