హైదరాబాద్, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ): మైనారిటీ సంక్షేమశాఖ ప్రభుత్వ సలహాదారు ఏకే ఖాన్ పదవీ కాలాన్ని రాష్ట్ర ప్రభుత్వం మరో ఏడాదికి పొడిగిస్తూ గురువారం ఉత్తర్వులు జారీచేసింది. విశ్రాంత ఐపీఎస్ అధికారి అయిన ఏకే ఖాన్.. తొలిసారిగా 2017లో ప్రభుత్వ సలహాదారుగా నియమితులయ్యారు. 2019లో పదవీకాలాన్ని ప్రభుత్వం పొడిగించగా, తాజాగా మరో ఏడాది పెంచింది.