ఔరంగాబాద్: ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ మహారాష్ట్రలో పర్యటించారు. ఔరంగాబాద్లో మొగల్ చక్రవర్తి ఔరంగజేబు సమాధి వద్ద అక్బరుద్దీన్ పుష్ప నివాళి అర్పించారు. రాజ్ థాకరే గురించి మాట్లాడేందుకు తాను ఇక్కడకు రాలేదన్నారు. గుర్తింపు లేని వారి గురించి ఎందుకు మాట్లాడాలని ఆయన అన్నారు. స్వంత ఇండ్ల నుంచి పంపించిన వారి గురించి ఏం మాట్లాడాలని ప్రశ్నించారు. ఎవరి గురించి భయపడేది లేదన్నారు. ఇటీవల మహారాష్ట్రలో లౌడ్స్పీకర్ల వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. అయితే అక్బరుద్దీన్ మహారాష్ట్రలో టూర్ చేయడాన్ని శివసేన, బీజేపీలు తప్పుపట్టాయి.