‘అచిరకాలంలోనే నంబర్వన్ ఓటీటీ ప్లాట్ఫామ్గా ‘ఆహా’ నిలవడం గర్వంగా ఉంది. తెలుగుభాషలో ఓటీటీ ప్లాట్ఫామ్ ఉండాలని, కొత్త ఎంటర్టైన్మెంట్ను ప్రేక్షకులకు అందించాలనే మా లక్ష్యం ఫలించింది’ అని అన్నారు అల్లు అర్జున్. ‘ఆహా 2.ఓ ’ ఓటీటీ వెర్షన్ను మంగళవారం హైదరాబాద్లో ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ ‘ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకుల ఆదరణ వల్లే ఈ విజయం సాధ్యమైంది. నాన్న అల్లు అరవింద్తో పాటు రామేశ్వరరావు జూపల్లి, రామ్జూపల్లి తపన, కృషి వల్లే ‘ఆహా’ అత్యున్నత స్థాయికి చేరుకున్నది. అందరికి సులభంగా అర్థమయ్యే రీతిలో ‘ఆహా 2.ఓ’ ఉంటుంది’ అని తెలిపారు. తెలుగు వారికి కొత్త తరహా వినోదాన్ని అందించాలని ‘ఆహా’ మొదలుపెట్టిన రోజు మేము కన్న కల నేడు నిజమైందని అల్లు అరవింద్ అన్నారు. ‘199 దేశాల్లో ఆహా సబ్స్ర్కైబర్స్ ఉన్నారు. తెలుగు ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ‘ఆహా’ గేమ్ఛేంజర్గా నిలుస్తున్నది. ఈ ఏడాది కొత్త సినిమాలు, సిరీస్లతో మీ ముందుకు రాబోతున్నాం’ అని ఆహా ప్రమోటర్ రామ్జూపల్లి చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆహా అవార్డులను అందజేశారు. మంచు లక్ష్మి ప్రయోక్తగా వ్యవహరించిన ఈ వేడుకలో కథానాయికలు పాయల్ రాజ్పుత్, పూర్ణ సందడిచేశారు