ప్రస్తుతం తెలుగు సీనియర్ హీరోలు బాలీవుడ్ వైపు చూస్తున్నారు. ‘సైరా’ చిత్రంతో హిందీ చిత్రసీమలోకి రీఎంట్రీ ఇచ్చారు చిరంజీవి. సుదీర్ఘ విరామం తర్వాత నాగార్జున హిందీలో ‘బ్రహ్మాస్త్ర’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా వెంకటేష్ ఇదే ప్రయత్నాల్లో ఉన్నాడు. గతంలో ఆయన హిందీలో చేసిన ‘అనారి’ ‘తక్దీర్ వాలా’ చిత్రాలు మంచి విజయాలు సాధించాయి. దాదాపు పాతికేళ్ల విరామం తర్వాత వెంకటేష్ బాలీవుడ్లో పునరాగమం చేస్తూ సల్మాన్ఖాన్తో కలిసి ఓ మల్టీస్టారర్ చిత్రంలో నటించబోతున్నాడు. ఈ సినిమాకు ‘భాయ్జాన్’ అనే టైటిల్ను ఖరారు చేశారు. తమిళ హిట్ చిత్రం ‘వీరమ్’ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. ప్రస్తుతం వెంకటేష్, వరుణ్తేజ్ కథానాయకులుగా నటిస్తున్న ‘ఎఫ్-3’ చిత్రీకరణ జరుపుకుంటున్నది. ఫిబ్రవరిలో ప్రేక్షకులముందుకురానుంది.