Loksabha Elections 2024 : 20 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో లోక్సభ ఎన్నికల తొలి దశ పోలింగ్ శుక్రవారం జరుగుతోంది. పలు పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు బారులు తీరి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఇక తమిళనాడులోని మొత్తం 39 నియోజకవర్గాల్లో తొలి దశలోనే పోలింగ్ జరుగుతోంది.
తమిళ నటుడు సూర్య చెన్నైలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రతి ఒక్క ఓటరు తమ అభ్యర్ధుల గురించి తెలుసుకోవాలని, అభ్యర్ధుల గురించి పూర్తిగా తెలుసుకుని పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన కోరారు.
మరో నటుడు కార్తీ ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం విలేకరులతో మాట్లాడారు. ప్రతి ఒక్కరూ ఇండ్ల నుంచి బయటకు వచ్చి ఓటు వేయాలని, ఈరోజు సెలవు దినమని ఎవరూ భావించవద్దని, ప్రజలంతా తమ అభ్యర్ధుల గురించి తెలుసుకుని పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపు ఇచ్చారు.
Read More :