చెన్నై, జనవరి 17: దక్షిణాది సినీ ప్రియులకు కోలీవుడ్ హీరో ధనుష్ షాక్ ఇచ్చాడు. సూపర్స్టార్ రజనీకాంత్ పెద్ద కూతురు ఐశ్వర్యను పెండ్లి చేసుకొన్న ధనుష్.. ఆమె నుంచి విడిపోతున్నట్టు సంచలన ప్రకటన చేశాడు. ఈ మేరకు సోమవారం ట్విట్టర్లో ప్రకటన విడుదల చేశాడు. తమ 18 ఏండ్ల వైవాహిక బంధానికి స్వస్తి చెప్తున్నట్టు పేర్కొన్నాడు. ధనుష్, ఐశ్వర్య 2004లో పెండ్లి చేసుకోగా, ఇద్దరు పిల్లలున్నారు. ‘18 ఏండ్లు గా స్నేహితులుగా, జంటగా, తల్లిదండ్రులుగా, శ్రేయోభిలాషులుగా కలిసి ఉన్నాం. ఇక ఎవరిదారుల్లో వాళ్లం వెళ్లాలని నిర్ణయించుకొన్నాం. మా నిర్ణయాన్ని గౌరవించి, మా వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించ వద్దని కోరుతున్నాం. ఓం నమఃశివాయ’ అని ట్వీట్ చేశాడు.
అవును విడిపోతున్నాం
విడాకులపై ట్విట్టర్లో ధనుష్ ప్రకటన
‘18 ఏండ్లు గా స్నేహితులుగా, జంటగా, తల్లిదండ్రులుగా, శ్రేయోభిలాషులుగా కలిసి ఉన్నాం. ఇక ఎవరిదారుల్లో వాళ్లం వెళ్లాలని నిర్ణయించుకొన్నాం. మా నిర్ణయాన్ని గౌరవించి, మా వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించవద్దని కోరుతున్నాం’