టేక్మాల్, డిసెంబర్ 6 : విధుల్లో నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తప్పవని అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ హెచ్చరించారు. సోమవారం టేక్మాల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆ సమయం లో వైద్య సిబ్బంది ఎవరూ అందుబాటులో లేరు. ఉద యం 10 గంటలు దాటినా డాక్టర్, వైద్య సిబ్బంది విధులకు రాకపోవడంతో అదనపు కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొవిడ్ వ్యాక్సినేషన్ మండలంలో ఎంతవరకు పూర్తయింది.. రెండో విడుత వ్యాక్సినేషన్ ప్రక్రియ ఎలా కొనసాగుతుందని వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాల్సిన వైద్య సిబ్బంది సమయపాలన పాటించకపోవడం తగదన్నారు. మండలంలో వంద శాతం వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని సూ చించారు. అనంతరం కుసంగి గ్రామంలోని కొవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్ను ఆమె పరిశీలించారు. అదనపు కలెక్టర్ వెంటన అధికారులు, వైద్య సిబ్బంది తదితరులు ఉన్నారు.
ప్రతిఒక్కరూ టీకా తీసుకోవాలి..
మెదక్ రూరల్, డిసెంబర్ 6 : ప్రతిఒక్కరూ కొవిడ్ టీకా తీసుకోవాలని డాక్టర్ చంద్రశేఖర్ సూచించారు. సోమవారం మెదక్ మండలం మాచవరంలో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా హెల్త్ అసిస్టెంట్ శ్రీనివాస్, వైద్య సిబ్బంది కవిత, నిర్మల కొవిడ్ వ్యాక్సిన్పై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలు కొవిడ్ టీకాపై ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దన్నారు. ప్రతిఒక్కరూ మాస్క్ ధరించడంతోపాటు భౌతిక దూరం పాటించాలని సూచించారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
తూప్రాన్లో కరోనా టీకాల పంపిణీ..
తూప్రాన్ రూరల్, డిసెంబర్ 6 : మండలంలోని పోతరాజుపల్లి గ్రామంలో వైద్య సిబ్బంది ఇంటింటికీ తిరుగుతూ టీకాలు వేశారు. ప్రతిరోజూ ఒక్కో గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి వయోవృద్ధులకు, వికలాంగులకు టీకాలు వేస్తున్నామని వైద్య సిబ్బంది నాగరాణి తెలిపారు. ఆమె వెంట వైద్య సిబ్బంది శారద, ఉమ, లత ఉన్నారు.