ప్రాక్టీస్ బిట్స్
1. హైదరాబాద్ భవిష్యత్తు హైదరాబాద్ ప్రజలే నిర్ణయించాలి, నిజాం కాదు అని పిలుపు ఇచ్చింది?
ఎ) హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్
బి) హైదరాబాద్ కమ్యూనిస్టులు
సి) రజాకార్లు 4) ఆర్యసమాజం
2. నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ భారత ప్రభుత్వంతో యథాతథ ఒడంబడిక చేసుకున్నది?
ఎ) 1947, నవంబర్ 28
బి) 1947, నవంబర్ 29
సి) 1947, డిసెంబర్ 28
డి) 1947, డిసెంబర్ 29
3. మందుగుండు సామగ్రి కోసం నిజాం ఎవరితో ఒప్పందం కుదుర్చుకున్నాడు?
ఎ) సిడ్నీ కాటన్ బి) ఎల్ ఎడ్రూస్
సి) టీటీ మూర్ డి) హెన్రీ లష్విజ్
4. హైదరాబాద్ స్టేట్ బ్యాంకుతో ఏ బ్యాంకు సంబంధాలను భారత ప్రభుత్వం రద్దు చేసింది?
1) ఆంధ్రా బ్యాంక్
బి) ఇంపీరియల్ బ్యాంక్
సి) బ్యాంక్ ఆఫ్ బరోడా
డి) రిజర్వ్ బ్యాంక్
5. కింది వాటిలో సరైనవి?
ఎ) హైదరాబాద్ నిజాం భారత సెక్యూరిటీల నుంచి రూ.20 కోట్లు పాకిస్థాన్కు రుణంగా ఇచ్చాడు
బి) హైదరాబాద్ రాజ్య ప్రధాన మంత్రి మీర్ లాయక్ అలీ 1948, ఆగస్ట్ 24న యూఎన్వో జనరల్ సెక్రటరీకి భారత ప్రభుత్వంపై అధికారికంగా ఫిర్యాదు చేశాడు
సి) ఎ డి) ఎ, బి
6. భారత దేశంతో ఘర్షణ జరిగితే హైదరాబాద్ రాజ్యం రెండు రోజులు కూడా ఎదుర్కోలేదు అని వ్యాఖ్యానించింది?
ఎ) నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్
బి) ఎల్ ఎడ్రూస్ సి) సుల్తాన్ అహ్మద్
డి) మోయిన్ నవాజ్ జంగ్
7. భారత ప్రభుత్వంతో యథాతథ స్థితి ఒప్పందం చేసుకున్న నిజాం ఎప్పటివరకు హైదరాబాద్ రాజ్య విదేశీ వ్యవహారాలను భారత ప్రభుత్వానికి అప్పగించాడు?
ఎ) 1948, డిసెంబర్ 29
బి) 1948, నవంబర్ 29
సి) 1948, డిసెంబర్ 28
డి) 1948, నవంబర్ 28
8. హైదరాబాద్ రాజ్య ప్రధాన మంత్రి మీర్ లాయక్ అలీ ఎవరి సహాయంతో యూఎన్వో జనరల్ సెక్రటరీకి భారత ప్రభుత్వంపై ఫిర్యాదు చేశాడు?
ఎ) సిడ్నీ కాటన్ బి) మహ్మద్ అలీ జిన్నా
సి) వాల్టర్ మాంక్టన్ డి) హెన్రీ లష్విజ్
9. హైదరాబాద్ రాజ్యం ముందు రెండే మార్గాలున్నాయని, అవి భారత యూనియన్లో విలీనం కావడమో లేదా యుద్ధాన్ని ఎదుర్కోవడమో అని అఖిల భారత కాంగ్రెస్ సమావేశంలో ప్రకటించింది ఎవరు?
ఎ) సర్దార్ వల్లభాయ్ పటేల్
బి) జవహర్ లాల్ నెహ్రూ
సి) చక్రవర్తుల రాజగోపాలచారి
డి) స్వామి రామానంద తీర్థ
10. భారత ప్రభుత్వంతో చర్చల కోసం నిజాం నియమించిన కొత్త ప్రతినిధి బృందంలో లేనివారు?
1) మోయిన్ నవాజ్ జంగ్
2) పింగళి వెంకట్రామారెడ్డి
సి) అబ్దుల్ రహీం డి) చత్తారి నవాజ్
11. నిజాంపై బాంబు దాడి చేసింది ఎవరు?
ఎ) కొండా లక్ష్మణ్ బాపూజీ
బి) నారాయణ రావు పవార్
సి) వందేమాతరం రామచంద్రారావు
డి) కుమ్రం భీం
సాసాల మల్లికార్జున్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, కోరుట్ల