ACB Rides | తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) డిప్యూటీ ఈవోగా లోకనాథం పనిచేస్తున్నారు. ఆయనపై ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ ఏసీబీ అధికారులు 7 బృందాలుగా ఏర్పడి బుధవారం ఉదయాన్నే దాడులు నిర్వహించారు. తిరుపతిలోని పెద్దకాపు లేఅవుట్లోని ఆయన ఇంట్లో సోదాలు చేశారు. ఈ దాడుల సమయంలో ఆయన ఇంట్లొనే ఉన్నారు.
తిరుమలలోని లోకనాథం కార్యాలయంతో సహా 7 చోట్ల ఏకకాలంలో సోదాలు చేశారు. శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవోగా విధులు నిర్వహిస్థున్న లోకనాథం టీటీడీ పలు ఆలయాల్లో డిప్యూటీ ఈవోగా పనిచేశారు. కోట్ల ఆస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఏసీబీ డీఎస్పీ శ్రీనివాసరావు నేతృత్వంలో అధికారులు 7 బృందాలుగా ఏర్పడి ఉదయం 6 గంటల నుంచే అతడి ఇంటితో సహా ఆయన బంధువుల ఇళ్లపై దాడులు నిర్వహించారు.

Acb
ఏర్పేడు మండలంలోని చెల్లూరు ఉంటున్న లోకనాథం సోదరుడు ఇంటితో పాటు ఆయన ఇద్దరు బావమరుదుల ఇళ్లలో సోదాలు చేశారు. తిరుపతి ఎస్టీవీ నగర్లో ఉన్న SBI బ్యాంక్లోని లాకర్లను తనిఖీ చేశారు. ఈ దాడుల్లో పలు పత్రాలు, నగదు, బంగారం, వెండి లభించాయని, ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు సమాచారం.
గతంలో 2011లో కూడా టీటీడీ డిప్యూటీ ఈవో భూపతి రెడ్డిపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. 15 ఏండ్ల తరువాత టీటీడీ ఉద్యోగిపై ఏసీబీ దాడులు నిర్వహించడం ఇదే తొలిసారి.