Arti Ravi | ఈ మధ్య కాలంలో సెలబ్రిటీల విడాకుల వార్తలు ఎక్కువగా వింటున్నాం.మనస్పర్ధల వలన కొందరు విడాకులు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే తమిళ స్టార్ హీరో జయం రవి తన భార్యతో విడాకులు తీసుకునేందుకు సిద్ధమయ్యాడు. 18 సంవత్సరాల పాటు వివాహ జీవితాన్ని గడిపిన రవి,ఆర్తి ఇప్పుడు విడాకులు తీసుకునే దశలో ఉన్నారు. వీరి డైవర్స్ కేసు కోర్ట్ లో ఉంది. ఆ జంటకి ఆరవ్, ఆయాన్ అనే ఇద్దరు చిన్నారులు ఉన్నారు. అయితే జయం రవి రీసెంట్గా సింగర్ కెన్నీషాతో కలిసి వేడుకలో పాల్గొన్నాడు. వారిద్దరు రిలేషన్లో ఉన్నారు కాబట్టే భార్యకి విడాకులు ఇచ్చాడని ముచ్చటించుకుంటున్నారు. దానిని జయం రవి ఖండించారు.
ఇక తాజాగా జయం రవి సతీమణి ఆర్తి రవి .. జయం రవి పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఆమె తన సామాజిక మాధ్యమాల్లో ఓ భావోద్వేగ భరితమైన ప్రకటనను పోస్ట్ చేసింది. రవి తనను ఎమోషనల్గా, ఫైనాన్షియల్గా నిర్లక్ష్యం చేశాడని ఆరోపించారు. గత సంవత్సరం నుండి పూర్తిగా మౌనంగా ఉన్నానని పేర్కొన్న ఆర్తి, ఇది నా బలహీనత కాదు, పిల్లల శాంతి కోసమే అని చెప్పుకొచ్చింది. ప్రతి ఆరోపణ, విమర్శ నేను మౌనంగా భరిస్తూ వచ్చాను. నా పిల్లల జీవితాల్లో తల్లిదండ్రుల మధ్య ఎంచుకోవాల్సిన బాధ్యతను వేయకూడదని అనుకున్నా అని ఆర్తి తన నోట్లో వెల్లడించారు
ఇంటి విషయంలో బ్యాంక్ నుంచి కొత్త సమస్య ఉత్పన్నం అయింది. అప్పుడు లెక్కల కంటే ప్రేమకే విలువ ఇచ్చాను.. ప్రేమించాను కాబట్టే ఇప్పుడు నా ఈ పరిస్థితికి కారణం. 10,14 ఏళ్ల వయసు ఉన్న నా పిల్లల భద్రత నాకు కావాలి. నా ఫోన్ కాల్స్ లిఫ్ట్ చేయకపోవడం.. మీటింగ్స్ క్యాన్సిల్ చేయడం.. మెసేజ్ కు రిప్లై ఇవ్వకపోవడం గాయాల్లాంటివే. నేను అన్యాయానికి గురైన మహిళాగ, భార్యగా, పిల్లల శ్రేయస్సే లక్ష్యంగా ఉన్న తల్లిగా మాట్లాడుతున్నాను. ఇప్పటికైన నేను మాట్లాడకపోతే వారికి భవిష్యత్ లేనట్టే అవుతుంది. తండ్రి అంటే టైటిల్ మాత్రమే కాదు, అదొక బాధ్యత. విడాకుల విషయంలో తుది తీర్పు వచ్చే వరకు నా ఇన్ స్టా పేరు ఆర్తి రవి అనే ఉంటుంది. నేను ఏడవడం లేదు.. కానీ ఇప్పటికీ నాన్నా అని నిన్ను పిలుస్తున్న పిల్లల కోసం నిలబడ్డాను అంటూ ఆర్తి రవి చాలా ఎమోషనల్గా కామెంట్ చేసింది..