న్యూఢిల్లీ: కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవడానికి ఆధార్ వివరాలు తప్పనిసరి కాదు కేంద్రం ప్రభుత్వం చెప్పింది. ఈ నేపథ్యంలో ఓ పిల్ విషయంలో సుప్రీంకోర్టు స్పందిస్తూ.. వ్యాక్సిన్ ఇచ్చే సమయంలో ఎవరి వద్ద ఆధార్ ఇవ్వాలని వత్తిడి చేయరాదు అని అధికారులకు అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. జస్టిస్ డీవై చంద్రచూడ్, సూర్యకాంత్లతో కూడిన ధర్మాసనం ఇవాళ ఓ పిల్ను విచారించింది. ఆ సమయంలో ధర్మాసనం ఆదేశాలు ఇస్తూ.. టీకా ఇస్తున్న సందర్భంగా ఆధార్ కార్డు కోసం వత్తిడి చేయరాదు అని పేర్కొన్నది. కోవిన్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ కోసం ఆధార్ కార్డు తప్పనిసరి కాదు అని కేంద్ర ఆరోగ్యశాఖ గతంలోనే స్పష్టం చేసింది. ఆరోగ్యశాఖ తరపున వాదించిన అడ్వకేట్ అమన్ శర్మ మాట్లాడుతూ.. 87 లక్షల మందికి ఎటువంటి ఐడీ కార్డు లేకుండానే టీకా ఇచ్చినట్లు చెప్పారు.