న్యూఢిల్లీ, నవంబర్ 9: ఆఫ్లైన్లోనే ఇకపై ఆధార్ కార్డు ధ్రువీకరణ ప్రక్రియను పూర్తిచేసుకోవచ్చు. ఈ మేరకు ఆధార్ (అథెంటికేషన్ అండ్ ఆఫ్లైన్ వెరిఫికేషన్) రెగ్యులేషన్స్ 2021ను మంగళవారం యునిక్ ఐడెంటిటీ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) నోటిఫై చేసింది. యూఐడీఏఐ రూపొందించిన డిజిటల్ సైన్ డాక్యుమెంట్ను ఇవ్వడం ద్వారా దీన్ని పూర్తిచేయవచ్చని తెలిపింది. ఏజెన్సీలు నిక్షిప్తం చేసిన ఈ-కేవైసీ వివరాలను రద్దు చేసుకునే హక్కును ఆధార్ కార్డుదారులకు కల్పిస్తున్నట్టు వెల్లడించింది.