శర్వానంద్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ చిత్రాన్ని మార్చి 4న విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. తొలుత ఈ సినిమాను ఈ నెల 25న విడుదల చేయడానికి సన్నాహాలు చేసిన విషయం తెలిసిందే. కిషోర్ తిరుమల దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుంది. క్లీన్ ‘యు’ సర్టిఫికెట్ లభించింది. దర్శకుడు మాట్లాడుతూ ‘ఇప్పటికే విడుదల చేసిన పాటలు, టీజర్కు మంచి స్పందన లభిస్తున్నది. సకుటుంబ కథా చిత్రమిది. మహిళల ఔన్నత్యాన్ని చాటుతూ ఆహ్లాదభరితంగా సాగుతుంది’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సుజిత్సారంగ్, సంగీతం: దేవిశ్రీప్రసాద్, ఎడిటర్: శ్రీకర్ప్రసాద్, నిర్మాణ సంస్థ: శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్, దర్శకత్వం: తిరుమల కిషోర్.