సిర్పూర్(టీ), సెప్టెంబర్ 10 : కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(టీ) మండల కేంద్రంలో శనివారం నిర్వహించిన గణేశ్ నిమజ్జనంలో అపశ్రుతి చోటుచేసుకొన్నది. స్థానిక బస్టాండ్ ప్రాంతానికి చెందిన ముప్పడి తిరుమలేశ్ (25) మేషన్కాలనీలోని గణేశ్ నిమజ్జనోత్సవాల్లో పాల్గొనేందుకు వెళ్లాడు.
అక్కడ స్నేహితులతో కలిసి డాన్స్ చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. స్థానికులు వెంటనే అతడిని సిర్పూర్(టీ) సామాజిక దవాఖానకు తరలించారు. డాక్టర్లు పరిశీలించి అప్పటికే మృతి చెందినట్టు ధ్రువీకరించారు.