Murder : జగిత్యాల జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. జిల్లాలోని వెల్గటూర్ మండలం మారేడుపల్లి గ్రామంలో తాజా మాజీ ఉప సర్పంచ్ వ్యాళ్ళ పున్నంరెడ్డి మంగళవారం రాత్రి భార్యతో గొడవపడ్డాడు. ఈ సందర్భంగా ఇనుప రాడ్డు తీసుకుని రజిత తలపై బలంగా కొట్టడంతో ఆమె విలవిల్లాడుతూ అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.
మంగళవారం రాత్రి 11:30 సమయంలో ఈ ఘటన జరిగింది. గ్రామస్తుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేపట్టారు. పెద్దపల్లి సీఐ, బసంత్ నగర్ ఎస్ఐల ఆధ్వర్యంలో ఈ దర్యాప్తు జరుగుతున్నది.