అమరావతి : తెలంగాణలోని భద్రచలం నుంచి భారీగా వరద ప్రవాహం ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్దకు చేరుకుంటుంది. నిన్న ఉదయం రెండో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించుకున్న అధికారులు సాయం త్రం నుంచి గోదావరికి భారీగా వరద ప్రవాహం వస్తుండడంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను మరోసారి జారీ చేశారు. ప్రస్తుతం బ్యారేజ్ వద్ద 15అడుగుల వరకు నీటి మట్టం కొనసాగుతుంది.
డెల్టా కాల్వల కు 10,800 క్యూసెక్కులు, సముద్రంలోకి 14.73లక్షల క్యూసెక్కుల అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో విలీన మండలాల్లోని గ్రామాలకు వరద నీరు వచ్చి చేరుతుండడంతో గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోనసీమలోని లంకగ్రామాలు10 రోజులుగా గ్రామాలు జలదిగ్బంధనంలోనే ఉన్నాయి. ప్రజలు నాటు పడవలో రాకపోకలు సాగిస్తున్నారు.