జాతీయ పంచాయతీ పార్లమెంటు సదస్సుకు గోవా సీఎం ఆహ్వానం
మెట్పల్లి రూరల్, నవంబర్ 1: జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం ఆత్మనగర్ సర్పంచ్ జరుపుల శ్రీనివాస్కు అరుదైన గౌరవం దక్కింది. గోవా రాజధాని పనాజీలో ఈ నెల 12న జరగనున్న జాతీయ పంచాయతీ పార్లమెంటు సదస్సుకు హాజరుకావాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ఆహ్వానించారు. ఈ మేరకు సీఎం పంపిన ఆహ్వాన లేఖ సోమవారం శ్రీనివాస్కు చేరింది. జాతీయ పార్లమెంటు సదస్సులో భాగంగా నిర్వహించే ఆత్మనిర్భర్ స్వయం పూర్ణ పంచాయత్ కార్యక్రమంలో గ్రామ సుస్థిరాభివృద్ధిపై ఉపన్యసించాలని లేఖలో కోరారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ను చుట్టుపక్కల గ్రామాల సర్పంచులు, గ్రామస్థులు అభినందించారు.