రాజ్తరుణ్, వర్ష బొల్లమ్మ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘స్టాండప్ రాహుల్’. ‘కూర్చుంది చాలు’ ఉపశీర్షిక. శాంటో మోహన్ వీరంకి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. నందకుమార్ అబ్బినేని, భరత్ మాగులూరి నిర్మాతలు. ఈ నెల 18న విడుదలకానుంది. శుక్రవారం ట్రైలర్, పాటల్ని ప్రదర్శించారు. దర్శకుడు మాట్లాడుతూ ‘వైజాగ్ నేపథ్యంలో నడిచే కథ ఇది. నా జీవితంలో చూసిన కొందరు వ్యక్తుల స్ఫూర్తిగా ఈ కథ రాసుకున్నా’ అని చెప్పారు. ‘సింగిల్ సిట్టింగ్లోనే ఈ కథ ఓకే చేశాం. ఈ సినిమా కోసం రాజ్తరుణ్ వర్క్షాప్ కూడా చేశాడు. ఆద్యంతం వినోదంతో ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్విస్తుంది’ అని నిర్మాత తెలిపారు. రాజ్తరుణ్ మాట్లాడుతూ ‘వినోదంతో పాటు హృదయాల్ని కదిలించే ఎమోషన్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరు కథతో కనెక్ట్ అవుతారు’ అని చెప్పారు. స్టాండప్ కమెడియన్గా రాజ్తరుణ్ చేసే హంగామాతో ట్రైలర్ వినోదప్రధానంగా ఆకట్టుకుంది. వెన్నెల కిషోర్, మురళీశర్మ, ఇంద్రజ ఇతర ప్రధాన పాత్రల్ని పోషిస్తున్నారు.