హుజూర్నగర్ , ఫిబ్రవరి 22: ఓ పెంపుడు పిల్లి రెండు కుటుంబాల మధ్య లొల్లికి కారణమైంది. పిల్లి తమదంటే తమదని ఘర్షణకు దిగగా, పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నాయి. ఈ విచిత్ర ఘటన సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో మంగళవారం చోటుచేసుకున్నది. పట్టణంలోని దద్దనాల చెరువు ప్రాంతానికి చెందిన మద్దెల ముత్యాలు ఏడాది క్రితం మైసూరులో జూలు కుక్క లక్షణాలున్న పిల్లిని కొనుగోలు చేసి పెంచుకొంటున్నాడు. అయితే, 10 నెలల క్రితం ఇంటి నుంచి బయటకు వెళ్లిన పిల్లి కనిపించట్లేదు. ఇటీవల పట్టణంలోని రామస్వామిగట్టు వద్ద జాతర జరుగుతున్న సమయంలో బానోతు సుక్కమ్మ ఇంటి వద్ద పిల్లిని ముత్యాలు గమనించాడు. మంగళవారం సుక్కమ్మ ఇంటికి వెళ్లి పిల్లి తనదేనని, మైసూరులో కొన్నానని తనకు ఇవ్వాలని అడిగాడు. ఆమె ససేమిరా అనడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది. మాటామాటా పెరిగి పిల్లి పంచాయతీ పోలీస్స్టేషన్కు చేరింది. ఎస్సై కౌన్సెలింగ్ ఇచ్చి ఇరువర్గాలకు సర్ది చెప్పి పిల్లిని సుక్కమ్మకు అప్పగించారు. ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.