అమరావతి : గుంటూరు జిల్లా తెనాలి (Tenali) లో విషాదం చోటు చేసుకుంది. ఐతానగర్లో మున్సిపల్ కార్మికుడు పనిచేస్తుండగా మట్టిపెళ్లలు మీదపడి మృతి చెందాడు. తాగునీటి పైపులైన్ల(Pipelines) కు మరమ్మతు పనులు చేస్తుండగా ఒక్కసారిగా మట్టిపెళ్లలు విరిగిపడి మున్సిపల్ కార్మికుడు వెంకటేశ్వర్లు మీదపడ్డాయి. దీంతో కార్మికుడు ఊపిరాడక మృతి చెందాడు. పోలీసులు, మున్సిపల్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.