వరంగల్ : వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లోని పత్తి యార్డులో రూ. 5 భోజనం క్యాంటీన్ టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ మంగళవారం ప్రారంభించారు. కార్యక్రమంలో చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ రవీందర్ రెడ్డి, మార్కెటింగ్ శాఖ అధికారులు, టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నేతలు తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు మార్కెట్ లోని అపరాల యార్డులో చిల్లీస్ టెస్టింగ్ యూనిట్ను ఎమ్మెల్యే ప్రారంభించారు.