యాదాద్రి భువనగిరి : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలోని(Choutuppal) ఓం సాయి ప్లాస్టిక్ గోదాంలో(Plastic warehouse )భారీ అగ్ని ప్రమాదం(Massive fire )చోటుచేసుకుంది. దట్టంగా పొగలు అలుముకోవడంతో గుర్తించిన సిబ్బంది వెంటనే బయటక పరుగులు తీశారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి ప్రాణహాని జరగలేదు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.