Boat capsize : కోసి నది (Kosi river) లో బుధవారం విషాదం జరిగింది. మొత్తం 13 మంది ప్రయాణికులతో వెళ్తున్న పడవ తలకిందులై నీట మునగడంతో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. మిగతా 12 మంది గల్లంతయ్యారు. బీహార్ రాష్ట్రం (Bihar state) దర్భంగా జిల్లాలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. గల్లంతైన వారి కోసం రెస్క్యూ టీమ్స్ (Rescue teams) గాలిస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. నదికి ఒకవైపు గ్రామంలోని కూలీలు అవతలివైపు గ్రామంలో పెసరపంట కోసేందుకు వెళ్లారు. పని ముగిసిన అనంతరం వారంతా స్వగ్రామానికి చేరుకునేందుకు పడవలో నది దాటుతుండగా ప్రమాదం జరిగింది.
తర్వారా ఘాట్ దగ్గర ఉన్న వృత్తాకార గట్టు సమీపంలో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. పడవ మునగగానే అందులోని 13 మంది గల్లంతయ్యారని, అయితే రెస్క్యూ టీమ్స్ గాలించగా ఒకరి మృతదేహం లభ్యమైందని చెప్పారు. కాగా గత నెలలో కూడా బీహార్లోని సమస్తిపుర్ జిల్లాలో పడవ నీట మునిగి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. నలుగురి జాడ గల్లంతయింది. ఆ సమయంలో పడవలో 14 మంది ప్రయాణిస్తున్నారు. బలమైన గాలుల కారణంగా పడవ అదుపుతప్పి బోల్తా పడింది. అంతకుముందు ఏప్రిల్లో కూడా మధ్యప్రదేశ్లోని బార్గి డ్యామ్ రిజర్వాయర్ సమీపంలోని నర్మదా నదిలో పర్యాటకుల పడవ తుపానులో చిక్కుకుని తలికిందులైంది. కనీసం ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.
VIDEO | Bihar: A boat carrying 13 people capsizes in Kosi River in Darbhanga. One body has been recovered. Rescue operations are underway. More details are awaited.
(Full video available on PTI Videos – https://t.co/n147TvrpG7) pic.twitter.com/2Y5NU01VQo
— Press Trust of India (@PTI_News) June 10, 2026