‘సైనిక చర్యలు చాలాకాలం కొనసాగితే ఎగుమతులు-దిగుమతులు దెబ్బతింటాయి. చమురు, గ్యాస్ ధరలు పెరుగుతాయి. వాణిజ్య చెల్లింపులు ఆలస్యమవుతాయి
’ఖలీద్ ఖాన్, ఎఫ్ఐఈవో ఉపాధ్యక్షుడు
రష్యా-ఉక్రెయిన్ ఉద్రిక్త పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్టు, ఔషధ ఎగుమతులపై వేచిచూసే ధోరణి అవలంభించనున్నట్టు దేశీయ ఫార్మా సంస్థలు ప్రకటించాయి. గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఉక్రెయిన్కు 181 మిలియన్ డాలర్ల విలువైన ఔషధాలను భారత్ ఎగుమతి చేసింది. రష్యాకు 591 మిలియన్ డాలర్లు ఎగుమతులు జరిగాయి.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24: రష్యా-ఉక్రెయిన్ సైనిక సంఘర్షణ.. భారతీయ వాణిజ్యంపై ప్రభావం చూపుతుందని ఎగుమతిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సరకుల ఎగుమతులు, చెల్లింపులు, చమురు ధరలను ఈ దాడులు ప్రభావితం చేస్తాయని భారతీయ ఎగుమతి సంస్థల సమాఖ్య (ఎఫ్ఐఈవో) అంటున్నది. ప్రస్తుత పరిస్థితుల్లో రష్యా, ఉక్రెయిన్ ఇతర ఐరోపా దేశాలతో వాణిజ్యంపట్ల ఎగుమతిదారులు అప్రమత్తతతో ఉండాల్సిన అవసరం ఉన్నదని అభిప్రాయపడింది. కాగా, యుద్ధం ఎన్ని రోజులు జరిగితే అంత ఎక్కువగా వాణిజ్యం దెబ్బతింటుందని ఎఫ్ఐఈవో డైరెక్టర్ జనరల్ అజయ్ సహాయ్ అన్నారు. కరోనా ప్రభావం నుంచి కోలుకుంటున్న సమయంలో ఈ యుద్ధం వాణిజ్యానికి పెద్ద ఎదురుదెబ్బేనన్నారు. ఇక రష్యాపై పశ్చిమ దేశాల ఆంక్షలు కూడా భారత వాణిజ్యాన్ని ప్రభావితం చేస్తాయంటున్నారు. ఇదిలావుంటే రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం ప్రపంచ మార్కెట్లలోకి మరింత గోదుమల్ని ఎగుమతి చేసేందుకు భారత్కు అవకాశం ఇవ్వగలదని నిపుణులు అంచనా వేస్తున్నారు.
రష్యా నుంచి
ఉక్రెయిన్ నుంచి
రష్యాకు
ఉక్రెయిన్కు
2021-22లో ఇప్పటిదాకా భారత్-రష్యా ద్వైపాక్షిక వాణిజ్యం 9.4 బి.డాలర్లు,
భారత్-ఉక్రెయిన్ ద్వైపాక్షిక వాణిజ్యం 2.3 బి.డాలర్లు