తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన అద్భుతమైన జోనల్ వ్యవస్థతో 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కనున్నాయని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థుల కోసం ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి ఆలేరు పరిధిలోని గుండ్లగూడెం మార్కెట్ కమిటీ ఆవరణలో ఏర్పాటుచేసిన ఫ్రీ కోచింగ్ సెంటర్ను బుధవారం ఆయన ప్రారంభించారు. సమైక్య రాష్ట్రంలో నియామకాల్లో జరిగిన అన్యాయాలను గుర్తుచేసిన మండలి చైర్మన్ స్వరాష్ట్రంలో అత్యంత పారదర్శకంగా పోస్టుల భర్తీ చేపట్టేందుకు పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. యాదాద్రి జిల్లాలోనే ఉద్యోగాలు పొందేందుకు 950 పోస్టులు ఉన్నాయని, ఉచిత శిక్షణను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకుని లక్ష్యాన్ని చేరుకోవాలని ప్రభుత్వ విప్ సునీత సూచించారు.
ఆలేరు రూరల్, మార్చి 30 : ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన జోనల్ వ్యవస్థతో 95శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కనున్నాయని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. బుధవారం గుండ్లగూడెంలోని వ్యవసాయ మార్కెట్ ఆవరణలో ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి సహకారంతో ఏర్పాటు చేసిన ఉచిత కోచింగ్ సెంటర్ను గుత్తా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్థానిక ఎమ్మెల్యే నిరుద్యోగ యువతకు అందిస్తున్న సహకారం అభినందనీయమన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి ఉద్యోగాలు, ఉద్యోగోన్నతుల్లో తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. స్వరాష్ట్రంలో జోనల్ వ్యవస్థతో ఏ ఒక్కరికీ అన్యాయం జరుగదని పేర్కొన్నారు. ఉద్యోగ నియామకాలన్నీ అత్యంత పారదర్శకంగా జరుగుతాయని తెలిపారు. ఉద్యమ నినాదం అయినటువంటి నీళ్లు, నిధులు, నియామకాలు నెరవేరుతున్నాయని గుర్తు చేశారు. అనంతరం ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి మాట్లాడుతూ స్టడీ సర్కిల్తో నిరుద్యోగ యువతకు ఎంతో మేలు జరుగుతుందని పేర్కొన్నారు. స్వరాష్ట్రంలో లక్షన్నర ఉద్యోగాలు ఎలాంటి పైరవీలు లేకుండా పారదర్శకంగా భర్తీ చేశారని, దాదాపు మరో లక్ష ఉద్యోగాలు తాజాగా భర్తీ చేయనున్నారని తెలిపారు. స్థానికులకే ఉద్యోగాలు దక్కనున్నందున ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఉచిత కోచింగ్ సెంటర్ను ప్రారంభించేందుకు ముందుకు వచ్చిన పీజేఆర్ ఇనిస్టిట్యూట్ నిర్వాహకుడు జగదీశ్రెడ్డిని అభినందించారు. టెస్కాబ్ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి మాట్లాడుతూ నీళ్లు, నిధులు ఉద్యోగాలతో ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుకు సాగుతున్నారన్నారు. మన ఉద్యోగాలు మనకు రావాలని కృషి చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డమీది రవీందర్గౌడ్, ఆలేరు మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య, పీఏసీఎస్ చైర్మన్ మొగులగాని మల్లేశ్గౌడ్, యాదగిరిగుట్ట జడ్పీటీసీ తోటకూర అనూరాధ, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గంగుల శ్రీనివాస్, మహిళా విభాగం మండలాధ్యక్షురాలు కాసగల్ల అనసూయ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గ్యాదపాక నాగరాజు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు ఏసిరెడ్డి మహేందర్రెడ్డి, మామిడాల నర్సింహులు, గుగులోతు బద్ద్దూనాయక్, అయిలి కృష్ణ, మామిడాల భానుచందర్, పంతం కృష్ణ, గడ్డం అనిత, సీస మహేశ్వరి, ఆరె పాండు పాల్గొన్నారు.
హైదరాబాద్ వెళ్లి వేలాది రూపాయలు ఖర్చుపెట్టి పోటీ పరీక్షలకు కోచింగ్ తీసుకునే అవసరం లేకుండా స్థానికంగానే కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉంది. కోచింగ్తోపాటు స్టడీ మెటీరియల్ కూడా ఉచితంగా అందించడం గొప్ప విషయం. ఈ అవకాశాన్ని కల్పించినందుకు కృతజ్ఞతలు.
– డి.అంబిక, కొలనుపాక
ప్రతిభ కలిగిన పేద విద్యార్థులకు ఉచిత కోచింగ్ సెంటర్ ఎంతో ఉపయోగపడుతుంది. ఎమ్మెల్యే సునీతామహేందర్రెడ్డి తమ సొంత ఖర్చుతో హైదరాబాద్ నుంచి నిపుణులైన అధ్యాపకుల రప్పించి శిక్షణను అందించడం హర్షణీయం.
– వి. నిశిత, ఆలేరు