న్యూఢిల్లీ, ఏప్రిల్ 3: దేశంలో పెట్రో బాదుడు కొనసాగుతున్నది. ఆయిల్ కంపెనీలు తాజాగా ఆదివారం పెట్రోల్పై మరో 91 పైసలు, డీజిల్పై 87 పైసల చొప్పున పెంచాయి. గత 13 రోజుల వ్యవధిలో ఇంధన ధరలు పెరుగడం ఇది పదకొండోసారి. మొత్తంగా లీటర్ పెట్రోల్పై రూ.9.04, డీజిల్పై రూ.8.70 పెరిగింది. హైదరాబాద్లో పెట్రోల్ ధర రూ.117.24, డీజిల్ 103.32కి చేరింది. తాజా పెంపుతో దేశంలో దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో లీటర్ పెట్రోల్ ధర రూ.100 మార్క్ దాటేసింది. అత్యధికంగా రాజస్థాన్లోని శ్రీగంగానగర్లో పెట్రోల్ రూ.120.65 వద్ద ఉండగా, ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరులో లీటర్ డీజిల్ రూ.105.52కి అమ్ముతున్నారు. నిత్యం పెట్రో ధరలను పెంచుతుండటంపై కేంద్ర ప్రభుత్వం మీద కేరళ సీఎం విజయన్ మండిపడ్డారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపు వలన ద్రవ్యోల్బణం కూడా పెచ్చరిల్లే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఓవైపు రాయితీల్లో కోత విధిస్తూ.. మరోవైపు పన్నుల భారం వేస్తూ కేంద్రం సామాన్యులను ఇబ్బందుల పాల్జేస్తున్నదని విమర్శించారు.
హైదరాబాద్లో శనివారం ధర : పెంపు : తాజా ధర
పెట్రోల్ ,రూ.116.33 :91 పైసలు : రూ.117.24
డీజిల్ ,రూ.102.45: 87 పైసలు :రూ.103.32