హైదరాబాద్, జూన్ 12 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని ఆయా విశ్వవిద్యాలయాల్లో 2026-27 విద్యాసంవత్సారానికి ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(ఐసెట్)-2026 ఫలితాలను శుక్రవారం హైదరాబాద్లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో చైర్మన్ బాలకిష్టారెడ్డి, ఇతర ఉన్నతాధికారులు విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 56,206 మంది అభ్యర్థులు పరీక్షకు దరఖాస్తు చేసుకోగా, 51,146 మంది అభ్యర్థులు హాజరైనట్టు అధికారు లు తెలిపారు.
ఇందులో 46,654 (91.22%) మంది అర్హత సాధించినట్టు అధికారులు వెల్లడించారు. 23,353 మంది అబ్బాయిలు, 27,793 మంది అమ్మాయిలు పరీక్షకు హాజరు అయ్యా రు. ఇందులో 21,191 మంది అబ్బాయిలు, 25,463 మంది అమ్మాయిలు క్వాలిఫై అయ్యారు. అబ్బాయిలు 90. 74%, అమ్మాయిలు 91.62% ఉత్తీర్ణత సాధించారు. ఐసెట్-2026లో అమ్మాయిలు హవా కొనసాగించారు. ర్యాంకు కార్డులను https://icet.tgc he .ac. in నుంచి పొందవచ్చని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో టీజీ ఐసెట్ చైర్మన్, ఎంజీయూ వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్, కన్వీనర్ అల్వాల రవి, కో కన్వీనర్ మిర్యాల రమేశ్ పాల్గొన్నారు.