న్యూఢిల్లీ, అక్టోబర్ 27: ఢిల్లీలో 90శాతం కంటే ఎక్కువ మందిలో కరోనా యాంటిబాడీలు ఉన్నట్టు ఆరో విడుత సెరో సర్వేలో తేలింది. పురుషుల్లో కంటే మహిళల్లో ఎక్కువగా పాజిటివిటీ రేటు ఉంది. ఢిల్లీలోని 280 వార్డుల్లో 28వేల మందిపై సర్వే నిర్వహించి అధికారులు ఈ వివరాలను వెల్లడించారు. కరోనా తీవ్రంగా వ్యాపించిన ఏప్రిల్-మే నెలలకు ముందు నిర్వహించిన ఐదో విడుత సెరో సర్వేలో కేవలం 56.13 శాతం మందిలోనే యాంటిబాడీలు కనిపించాయి.