హైదరాబాద్, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ): ఈ ఏడాది రికార్డుస్థాయిలో 8,413 అప్పీళ్లను పరిష్కరించినట్టు రాష్ట్ర సమాచార హక్కు ప్రధాన కమిషనర్ బుద్దా మురళి వెల్లడించారు. 2017లో కమిషన్ ఏర్పడే నాటికే అప్పీళ్లు పెద్దఎత్తున పెండింగ్లో ఉన్నాయని, ఈ ఏడాది జనవరి 1 నుంచి డిసెంబర్ చివరి వరకు 6,792 అప్పీళ్లు వచ్చాయని తెలిపారు. కమిషన్ వద్ద ప్రస్తుతం 10 వేల కేసులు ఉన్నాయని, ఆరునెలల్లో అన్ని కేసులు విచారిస్తామని వెల్లడించారు. పెండింగ్లో ఉన్న అప్పీళ్లను గతంలోకన్నా తక్కువ సమయంలో పరిష్కరించామని వివరించారు. లాక్డౌన్ కాలంలో కమిషన్ టెలిఫోన్లోనే కేసులు విచారించిందని తెలిపారు. ప్రస్తుతం కమిషన్కు ఆన్లైన్లో కూడా అప్పీళ్లు చేసుకోవచ్చని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా సమాచార అధికారికి ఆన్లైన్లో దరఖాస్తు పంపించేలా ప్రయత్నాలు చేస్తున్నామని పేర్కొన్నారు.