హైదరాబాద్, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం వైద్యారోగ్యశాఖకు రూ.80.58 కోట్ల నిధులు విడుదల చేసింది. ఈ మేరకు గురువారం ఆ శాఖ కార్యదర్శి రిజ్వీ ఉత్తర్వులు జారీచేశారు. ఇందులో రూ.79.56 కోట్లు కుటుంబ సంక్షేమ శాఖకు, రూ.1.02 కోట్లు మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డుకు కేటాయించారు.