హైదరాబాద్, అక్టోబర్ 24 (నమస్తే తెలంగాణ): ఏపీలోని కర్నూలు జిల్లా పంచలింగాల చెక్పోస్టు వద్ద స్పెషల్ బ్రాంచ్ అధికారులు భారీగా నగదు పట్టుకున్నారు. బీదర్కు చెందిన గురునాథ్ అనే వ్యక్తి కారులో హైదరాబాద్ నుంచి కర్నూలు వైపు వస్తుండగా.. సిబ్బంది కారును ఆపి తనిఖీ చేయగా రూ.75 లక్షల నగదు కనిపించింది. నగదుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో అధికారులు దానిని సీజ్ చేశారు. కేసు నమోదుచేసి తాలూకా పోలీస్స్టేషన్లో నగదు అప్పగించినట్టు స్పెషల్ బ్రాంచ్ సీఐ మంజుల తెలిపారు.