గౌహతి: అరుణాచల్ ప్రదేశ్లోని కురుంగ్ కుమే జిల్లాలో జూలై 13వ తేదీన 19 మంది రోడ్డు నిర్మాణ కార్మికులు గల్లంతు అయ్యారు. మిస్సైనవారిలో ఏడు మంది కార్మికుల ఆచూకీ తెలిసింది. రెస్క్యూ చేసిన అధికారులు వాళ్లకు వైద్య సాయం అందిస్తోంది. కార్మికుల ఆచూకీ కోసం వైమానిక దళం ప్రత్యేక ఛాపర్లతో సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టింది.
దామిన్ సర్కిల్ వద్ద బోర్డర్ రోడ్డు పనిలో నిమగ్నమైన కార్మికులు రెండు వారాల క్రితం కనిపించకుండాపోయారు. రాజధాని ఇటానగర్కు 300 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన జరిగింది. చైనాతో ఉన్న వాస్తవాధీన రేఖకు సమీపంలోనే కార్మికులు అదృశ్యమయ్యారు. అయితే కుమే నదిలో ఓ కార్మికుడి మృతదేహాన్ని గుర్తించారు.
19 మంది కార్మికులు అస్సాం నుంచి వలస వచ్చినట్లు కాంట్రాక్టర్ తెలిపారు. ఈద్ పండుగ సెలబ్రేట్ చేసుకునేందుకు ఆ కాంట్రాక్టర్ కార్మికులకు లీవ్ ఇవ్వలేదని తెలుస్తోంది. జూలై 13వ తేదీన స్థానిక పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ ఫిర్యాదు ఇచ్చారు.