బ్రెసిలియా: మంచుదుప్పటి కప్పుకున్న అంటార్కిటికాలో ఒకప్పుడు కార్చిచ్చులు స్వైరవిహారం చేసేవట.7.5 కోట్ల సంవత్సరాల క్రితం (క్రెటేసియస్ యుగం) వాతావరణ మార్పుల కారణంగా రేగిన కార్చిచ్చులు అక్కడి వృక్ష, జంతు సంపదను దహించివేశాయని, ప్రాణరక్షణకు డైనోసార్ల వంటి కొన్ని భారీ మృగాలు కొండలు, తీరప్రాంతాలకు చేరుకున్నట్టు బ్రెజిల్ పరిశోధకులు తెలిపారు. ఈ పరిణామం తర్వాతనే గోండ్వానా భారీ ఖండం విడిపోయి అంటార్కిటికా క్రమంగా దక్షిణం వైపునకు వేరుచేయబడినట్టు వెల్లడించారు.