సిరిసిల్ల రూరల్, నవంబర్ 15: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం శివారులోని మానేరువాగులో సోమవారం ఈతకువెళ్లి ఆరుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. ఒకరి మృతదేహం లభ్యమైంది. ఐదుగురి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. పట్టణంలోని రాజీవ్నగర్ కార్మిక క్షేత్రానికి చెంది న గణేశ్ (13), వెంకటసాయి (13), రాకేశ్ (12), క్రాంతికుమార్ (14), అజయ్ (13), మనోజ్ (16) చెక్డ్యాం ప్రాం తంలో వాగులో కొట్టుకుపోయారు. విషయం తెలుసుకు న్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని గణేశ్ మృతదేహాన్ని వెలికితీయించారు. అర్ధరాత్రి వరకు మిగిలిన వారి ఆచూకీ లభ్యం కాలేదు.