అంబాలా: ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు వ్యక్తులు అనుమానాస్పద రీతిలో మృతిచెందారు. అంబాలాలోని బలానా గ్రామంలో ఈ ఘటన జరిగింది. మృతిచెందిన వారిలో సంగత్ రామ్, భార్య మహిందర్ కౌర్, కుమారుడు సుఖ్విందర్ సింగ్, సుఖ్విందర్ భార్య రినా, వాళ్లు పిల్లలు అషు, జాసిలు ఉన్నారు. సుఖ్విందర్ తన కుటుంబ సభ్యులకు విషం ఇచ్చి ఆ తర్వాత అతను ఉరి వేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. సుఖ్విందర్ ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. పోస్టుమార్టమ్ కోసం మృతదేహాలను అంబాలా సిటీ సివిల్ ఆస్పిటల్కు తరలించారు.